జీవితాంతం కలిసి బతకాల్సిన దంపతులు చిన్న చిన్న గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.  భార్య కాపురానికి రాలేదని అత్యంత దారుణంగా హత్య చేసాడో భర్త. వివరాల్లోకి వెళితే పుట్లూర్ మండలం మదుపల్లికి చెందిన నడిపి బయన్న- లక్ష్మిదేవి దంపతుల మూడో కుమార్తె అయిన వెంకటలక్ష్మమ్మను 8 ఏళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన శేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. 

 

కొన్నేళ్ల వరకు ఎలాంటి గొడవలు లేకుండా  సాఫీగా సాగిన వారి జీవితంతో కొంత కాలం నుండి కలహాలు మొదలయ్యాయి. భర్త వైఖరికి విసుగును చెందిన భార్య వెంకటలక్ష్మమ్మ ఆరునెలల క్రితం కుమారుడు దేవా(6 ) ను తీసుకోని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి కాపురానికి రావాలని భర్త రోజు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఆమె దానికి నిరాకరించడంతో పెద్దమనుషులలో పంచాయతీ కూడా పెట్టించాడు. 

 

అయినా ఆమె వినకపోవడంతో తరచుగా మడుగుపల్లికి వచ్చి ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే శేఖర్‌ సోమవారం కూడా మడుగుపల్లికి వచ్చాడు. అత్తవారింటిలో ఒంటరిగా ఉన్న  భార్యతో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. చివరికి భార్య కాపురానికి రాదన్న అనుమానం, ఆగ్రహంతో గొడవపడుతూనే ఇంటి లోపలికి వెళ్లి తలుపునకు గొళ్లెం పెట్టాడు. వెంటనే వంటింటిలో ఉ న్న రుబ్బురోకలి బండతో భార్య తలపై గట్టిగా మోదాడు. అనంతరం కొడవలితో నరికేందుకు ప్రయత్నించగా... అప్పటికే కుప్పకూలిన ఆమె చనిపోయిందని తెలుసుకున్న శేఖర్‌ కుమారుడిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 

 

రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తెను చూసిన తల్లితండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ దేవేంద్రకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: