కడాయి పన్నీర్ కర్రీ.. ఎంతో మందికి ఇష్టం.. శాకాహారులు అయితే పన్నీర్ కర్రీని ఎంతో రుచిగా వెరైటీగా చేసుకొని తింటారు. అయితే అలా వారు రకరకాలు చేసుకునే సమయంలోనే కడాయి పనీర్‌, పాలక్ పన్నీర్, పన్నీర్ బట్టర్ మసాలా, స్పైసి పన్నీర్ ఇలా పలు రకాల రెసిపీస్ ని కనిపెట్టారు. అయితే ఈ కడాయి పనీర్‌ కర్రీ చేస్తే అదిరిపోతుంది. 

 

అయితే ఈ కడాయి పనీర్‌ క్యాప్సికం కర్రీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అలాంటి వారంతా ఇక్కడ ఎలా చెయ్యాలో చదివి కడాయి పనీర్‌ కర్రీని ఇంట్లోనే చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

కావలసిన పదార్థాలు..  

 

పనీర్‌- పావుకేజీ, 

 

క్రీమ్‌- రెండు టేబుల్‌స్పూన్లు, 

 

గరంమసాలా- పావు టీస్పూన్‌, 

 

కొత్తిమీర- ఒక కట్ట.

 

ధనియాలు- రెండు టీస్పూన్లు, 

 

జీలకర్ర- ఒక టీస్పూన్‌, 

 

మిరియాలు - అర టీస్పూన్‌, 

 

ఎండు మిర్చి- మూడు.


నూనె- రెండు టీస్పూన్లు, 

 

అల్లం- చిన్నముక్క, 

 

వెల్లుల్లి రెబ్బలు- మూడు, 

 

ఉల్లిపాయ- ఒకటి, 

 

టొమాటోలు- రెండు.

 

వెన్న- ఒక టేబుల్‌ స్పూన్‌, 

 

బిర్యానీ ఆకు- ఒకటి, 

 

పచ్చిమిర్చి- ఒకటి, 

 

మెంతి ఆకులు- కొద్దిగా, 

 

ఉల్లిపాయ- ఒకటి, 

 

క్యాప్సికం- ఒకటి, 

 

పసుపు- పావు టీస్పూన్‌, 

 

కారం- అర టీస్పూన్‌, 

 

నీళ్లు- ఒక కప్పు.

 

తయారీ విధానం... 

 

టొమాటోలు, ఉల్లిపాయను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ధనియాలు, జీలకర్ర వేగించి, మిరియాలు, ఎండుమిర్చితో సహా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని వెన్న వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మెంతి ఆకులు వేగించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం వేయాలి. పసుపు, కారం వేసి మరికాసేపు వేగించాలి. దీనిలో గ్రైండ్‌ చేసిపెట్టుక్నున్న టొమాటో, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. అలాగే మసాలా పొడి కలపాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. అవసరమైతే అరకప్పు లేదా కప్పు నీళ్లు పోయాలి. పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసి వేయాలి. క్రీమ్‌ కూడా వేసి బాగా కలపాలి. చిన్నమంటపై మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి దించాలి. అంతే టేస్టీ టేస్టీ కడాయి పనీర్‌ కర్రీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: