కావాల్సిన పదార్థాలు:
బియ్యం- రెండు కప్పులు
పసుపు- అర టీస్పూన్
సెనగపప్పు- ఒక టేబుల్స్పూన్
మినప్పప్పు- ఒక టేబుల్స్పూన్
కరివేపాకు- కొద్దిగా
ఉప్పు- తగినంత
గోంగూర- రెండు కట్టలు
ఆవాలు- ఒక టీస్పూన్
మెంతులు- అర టీస్పూన్
పచ్చిమిర్చి- మూడు
ఇంగువ- చిటికెడు
నూనె- తగినంత
ఎండు మిర్చి- రెండు
ఆవాలు- ఒక టీస్పూన్
జీలకర్ర- పావు టీస్పూన్
ఎండు మిర్చి- రెండు
తయారీ విధానం:
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరికాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక గోంగూర వేగించాలి. పచ్చిదనం పోయే వరకు వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేయాలి.
తరువాత గోంగూర వేసి పేస్టు మాదిరిగా పట్టుకోవాలి. మళ్లీ పాన్లో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేగించాలి. పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత గోంగూర పేస్టులో వేసి కలపాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంలో గోంగూర పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటే సరిపోతుంది. అంతే గోంగూర పులిహోర రెడీ..!