కావాల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్- ఒక కేజీ
మటన్- ఒక కేజీ
ధనియాల పొడి- అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి- అర టీ స్పూన్
వేగించిన ఉల్లి ముక్కలు- ఒక కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
పెరుగు- అర కప్పు
నిమ్మరసం- కొద్దిగా
కారం- రెండు టీ స్పూన్లు
ఆయిల్- సరిపడా
బిర్యానీ ఆకులు- నాలుగు
నెయ్యి- అర కప్పు
జీడిపప్పు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా మటన్ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, వేగించిన ఉల్లిముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలిపి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి.. అందులో గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. ఎసరు ఉడుకుపట్టగానే కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.
బియ్యం సగం ఉడికాక ఎసరు వంపేయాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన మటన్ను ఒక పొరలా వేయాలి. ఆ తర్వాత సగం ఉడికిన బియ్యాన్ని వేసి పైన నెయ్యి వేయాలి. ఇలా రెండు పొరలు వేసి మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో డెకటేర్ చేస్తే సరిపోతుంది. అంతే మటన్ బిర్యానీ రెడీ..!