సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వైరల్ అవ్వటం ఏంటి అనుకుంటున్నారా.. ?? ఏం లేదండి ఈ అమ్మడు మూడో బ్రేక్ అప్ తో వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా తమిళ స్టార్ దర్శకుడు విష్నేష్ శివన్‌ తో రిలేషన్‌ లో ఉన్న విషయం తెలిసిందే... మొదట శింబు.. ఆ తరువాత ప్రభుదేవాలతో సహజీవనం చేసిన నయన తార.. ఇప్పుడు విష్నేష్ శివన్-నయనతారలు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో నయన్ బ్రేక్ అప్ సంచలనం సృష్టిస్తోంది.
 

ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకుని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ఇండికేషన్స్ ఇచ్చారు. ఒకర్ని విడిచి ఒకరు క్షణం కూడా ఉండకుండా పలు సందర్భాల్లో తమ ప్రేమను వ్యక్తపరిచారు. అయితే ఏమైందో ఏమో కాని..  శివన్‌ కి బ్రేకప్ చెప్పేసిందనే వార్త తమిళ సినీ సర్కిల్స్‌ లో వైరల్ అవుతోంది. నిన్న మొన్నటి వరకూ జంటగా తిరుగుతూ రొమాంటిక్ జోడీ అనిపించుకున్న విష్నేష్ శివన్- నయన్‌ లు ఎవరి దారు వారు చూసుకున్నారట.


ఇంతకీ ఈ బ్రేకప్ వార్త ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ప్రతి ఈవెంట్‌ ను విష్నేష్‌ తో కలిసి సెలబ్రేట్ చేసుకునే నయన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విష్నేష్ లేకుండానే జరుపుకుందట. అప్పటికే ఇద్దరి మధ్య బ్రేకప్ జరగడంతో నయన్ సింగిల్‌ గా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ వార్త జోరందుకుంది. అంతేకాదు.. చాలా కాలంగా రిలేషన్‌ లో ఉన్న నయన్‌ ని విష్నేష్ పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నాడని.. అందుకే నయన్ బ్రేకప్ చెప్పినట్టు వార్తలు బయటికొస్తున్నాయి. 


ఆమె ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి ఉందని సహజీవనం అయితే ఓకే కాని పెళ్లి అయితే నా వల్ల కాదని నయన్ తన అభిప్రాయాన్ని చెప్పడంతో ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  నానుమ్‌ రౌడీదాన్‌ చిత్ర షూటింగ్ టైంలో నయన్.. ఈ చిత్ర దర్శకుడు విష్నేష్ శివన్ ప్రేమలో పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మోస్ట్ రొమాంటిక్ జోడీగా ఎక్కడ చూసినా జంటగానే కనిపించేవారు. రేపో.. మాపో పెళ్లి పీటలు ఎక్కుతారనుకునే లోపు ఈ బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: