చట్టాలు మారినా, దిశ లాంటి అమ్మాయిలు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. అయిన కూడా కామాంధుల కామ దాహం మాత్రం తీరలేదు .అమాయిల మీద ఆగాయిత్యలు జరుగున్నయి.. ఒక అమ్మాయిని ఒంటరిగా ఉండటం చూసిన ఎవరైనా కూడా ఎంత ఫ్రెండ్ అయిన కూడా వదలట్లేదు అంటేనమ్మండి..

 

అసలు వివరాల్లోకి వెళితే.. ఒడిశాలో ఈ దారుణం వెలుగు చూసింది.13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో 8 వతరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా 36 గంటల పాటు నిర్భంధించి అత్యాచారం జరిపారు. తండ్రిలేని ఆ బాలిక తల్లితో కలిసి అమ్ముమ్మ, తాతయ్యల దగ్గర ఉంటోంది. బాలిక తల్లి కూలి పనులకు వెళుతూ ఉంటుంది.

 

జనవరి 10 వతేదీ సాయంత్రం ఆబాలిక బయటకు వెళ్లేందుకు తనకు తెలిసిన దనారా అనే కాలేజీలో చదువుకునే యువకుడిని తోడు రమ్మని కోరింది. అతడు అందుకు నిరాకరించాడు.తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఒక ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమె స్పహ కోల్పోయాక మొత్తం ముగ్గురు కలిపి ఆమపై సామూహిక అత్యాచారం చేసినట్లు బెర్హంపూర్ పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. నిందితులు అపస్మారక స్ధితిలో ఉన్న బాలికను ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయారు.

 

 

అందుతున్న సమాచారం మేరకు..బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సునాపూర్ మెరైన్ పోలీసులు నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను వైద్యపరీక్షల నిమిత్తం బెర్హాంపూర్‌లోని ఎంకేసిజి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోక్సో చట్టం కింద, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేయబడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: