భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగితే  సర్దుకు పోవాలి లేకుంటే అనేక అనర్థాలు వస్తుంటాయి. లేదా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే అతి సున్నితమైన బంధం అంటే గుర్తొచ్చేది భార్య భర్తల బంధం అని చాలా మంది అంటుంటారు. అయితే, జీవితాంతం కలిసి మెలసి ఉండవలసిన ఈ బంధం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 


ఈ మధ్య కాలం లో  ఇద్దరు సమానం అనే ఒక అంశం ఉండటం వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద అఘాతానికి తావునిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతీతి సమానం అని అనుకోవడం వల్ల కుటుంబాలు కూడా చీలిపోతున్నాయి. అయితే, భర్తల మీద కన్నా భార్యల మీద చాలా మంది  భర్తలకు అనుమానం ఉంటుందన్న విషయం తెలిసిందే.. 

 

ఆ అనుమానం తో తన భార్యను పర లోకానికి పయమానంపాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో ని జైపూర్‌కు చెందిన అయాజ్‌ అహ్మద్‌(25) ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రేష్మా(22) అనే యువతిని రెండేళ్ల క్రితం ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొన్నేళ్లు సవ్యంగానే సాగిన వీరి దాంపత్యం తరువాత అనుమానులకు దారితీసింది.  మహిళకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో 6వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో భార్యకు ఉన్న ఫాలోయింగ్‌ చూసిన భర్తకు ఆమెపై  అసూయ ఏర్పడింది. 

 


ఆపై మాటా మాట పెరిగింది. అలా భర్తను విడిచి పుట్టింట్లో ఉన్న ఆమెను తీసుకురావడానికి వెళ్ళాడు. అత్తమామల కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాడు. దాంతో వారు అమ్మాయిని అతనితో పంపించారు. అలా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్ద బండరాయితీ హతమార్చాడు. అలా అయితే చనిపోలేదని అనుకున్న అతను గొంతు కోశాడు. తర్వాత శవాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: