ప్రేమ అనేది సాగరం లాంటిది ఉన్నంత వరకు అనంతం.. ప్రేమ తగ్గిందను కో అందరికి అంతం అన్న విషయం ఓ వ్యక్తి నిరూపించాడు. అందరి కి చుక్కలు చూపించాడు. బ్రతికుండాగానే నలుగురిని కాటికి పంపాడు. అందుకే ప్రేమించాలి కానీ ప్రేమకు మించిన అన్నీ చేయకూడదని పెద్దలు అంటున్నారు. ప్రేమించిన పాపాని కి ఓ యువతీ తన ప్రాణాల తో పాటుగా కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా పోయే లా చేసింది. 

 


వివరాల్లో కి వెళితే.. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా లో చోటు చేసుకుంది.. ఉన్మాది తీవ్ర ఘాతుకాని కి తెగబడ్డాడు. ప్రేమ పేరు తో యువతి ఇంటి పై శ్రీనివాస్ పెట్రోల్ దాడి చేశాడు. ఈ ఘటన లో అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు సజీవదహనం కాగా.. మరో ఇద్దరు ఆస్పత్రి లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొట్టిమిట్టాడుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. 

 

 ఇది ఇలా ఉండగా వీరంతా నిద్రలో ఉండగా.. దుర్మార్గుడు శ్రీనివాస్ ఈ తెల్ల వారుజామున ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటన కడియం మండలం దుళ్లలో జరిగింది.ప్రేమించిన యువతికి వేరే వ్యక్తి తో వివాహం చేశారన్న అక్కసు తో ఉన్మాది ఈ ఘోరానికి పాల్పడ్డాడని సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

ఈ ఘటనతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి స్వగ్రామం కూడా దుళ్ల కావడంతో అతడి ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఉన్మాదిని వదిలేయకూడదని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: