ఈ మధ్య క్రైమ్ రేటు గోల్డ్ రేటు కన్నా ఎక్కువగా పెరిగిపోతుందని..అందరికీ తెలిసిన విషయమే.. ఒకప్పుడు ఆడదానికోసం యుద్దాలు జరుగుతున్నాయి అంటే ఎవరు మమ్మరేమి.. కానీ ఇక్కడ కాస్త వెరైటీ గా జరిగింది.. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు.. నాకు కావాలి అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఎలా కాలాం గడిపేశారు.. అయితే ఈసారి పథకం వేసి మరీ దారుణంగా చంపేశారు..

 

మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని ఓ బార్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీపక్‌ బోయిర్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మనేర్‌ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దీపక్‌, నరేశ్‌ చావన్‌ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. ఓ మహిళ విషయంలో వారిద్దరూ పోట్లాటకు దిగారు. ఇది మనసులో పెట్టుకున్న చావన్‌ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతన్ని బార్‌కు రప్పించాలని ప్లాన్‌ వేశాడు. అందులో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్‌కు కాల్‌ చేసి బార్‌కు రావాలని కోరాడు.

 

వివరాల్లోకి వెళితే...ట్రాప్‌లో చిక్కుకున్న దీపక్‌, అతని స్నేహితుడిని తీసుకుని మంగళవారం ఉదయం 1.30కు స్థానిక డ్యాన్స్‌ బార్‌కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే బార్‌ బయటికి వచ్చాడు. అయితే అక్కడే కాచుకుని ఉన్న చావన్‌, ఐదుగురు అనుచరులతో కలిసి వారిని చుట్టుముట్టారు. కత్తులు, తుపాకీలు తీసి వారిపై దాడికి యత్నించారు. దీంతో దీపక్‌, అతని స్నేహితుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు అందుకున్నారు. కానీ దీపక్‌ మధ్యలో జారి కింద పడటంతో దుండగులు దీపక్‌పై కత్తితో దాడి చేశారు. చాతీ, పొట్ట, వీపు ప్రాంతాల్లో 30 సార్లు కిరాతకంగా పొడిచి చంపారు.

 

ఈ విషయాన్ని దీపక్‌ స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీపక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతనిపై కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: