నవసమాజం సిగ్గుతో చచ్చిపోతుందేమో.. అమ్మ పాలు తాగి రొమ్మును గుద్దే లుచ్చాగాళ్లు ఉన్నంతవరకు భరతమాతకు నెత్తుటి కన్నీరు ఆగదు. క్షణకాలం సుఖం కోసం ఎంతటి దారుణానికి అయినా కూడా ఈ మృగాళ్లు ఒడిగడుతున్నారు. ఆడది అయితే చాలు అనుకునే ఈ మగ మృగాళ్ల మధ్య పొత్తిళ్ళలో ఉండే పసికందు కూడా పాలు తాగడం ఆపేస్తుందంటే అర్థం చేసుకోండి సమాజం ఎంత నీచ స్థాయిలో ఉంది అనేది. 


దిశ లాంటి ఎందరో యువతుల నెత్తుఠితో వారి కామ దాహం తీర్చుకున్న కూడా ఆకలి తీరలేదేమో.. చట్టాలు మారిన కూడా మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకున్నాము. వావి వరుసలు మరచి మగాడు అనిపించుకోవడం కోసం మృగాళ్లు చేతుల నుండి ఆడపిల్ల ఎలా కాపాడుకోవాలి.మాతృభూమి మీద అమ్మ అనే మాట కంటది పెడుతుంది.. రోజుకొకరు ఈ కామాంధుల కామదాహానికి బలి అవుతున్నారు. 


విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మృగాళ్లు రెచ్చిపోయారు. ఓ ఒంటరి మహిళపై రాక్షసులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారంనాడు వెలుగు చూసింది. గొంతులో బియ్యం పోసి, గొంతులో మరి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 


మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని పోలీసులు రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనలో ఆమె గొంతులోకి బియ్యం వేయడం వల్ల అవి ఊపిరితిత్తుల్లోకి బియ్యం వెళ్లినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: