అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేదన్న సంగతి తెలిసిందే.. ఎటు చూసినా కూడా ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని రోడ్డు పై తిరుగుతున్నారు.. మృగాళ్ల కామాదాహం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ పిల్ల అని బ్రూనహత్యలు చేసి చంపేస్తారు. అమ్మ పోతిళ్ళ నుండి కూడా తీసుకెళ్ళి కామా కోరికలను తీర్చే సుకొని కాలా రాస్తున్నారు.. 

 

వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా... పలాసలోని వజ్రపుకొత్తూరు. ఎవరో రైల్వే ట్రాక్ దాటుతుండగా... ఓ యువతి శవం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూశారు. అత్యంత దారుణంగా ఉంది. వెంటనే పోలీసులకు కాల్ వెళ్లింది. పోలీసులు అక్కడికి వచ్చేటప్పటికే... ఊరి జనం మొత్తం శవం చుట్టూ ఉన్నారు. అందర్నీ పక్కకి జరుపుతూ డెడ్‌బాడీ దగ్గరకు పోలీసులు వెళ్లగానే... ఆ అమ్మాయి తమ కూతురే అంటూ... 16 ఏళ్ల ఆ యువతి శవం పక్కనే కూర్చొని బోరున ఏడుస్తూ పోలీసులను వేడుకున్నారు తల్లిదండ్రులు. 

 

తమ కూతుర్ని నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ చేసి చంపేశారనీ, దుర్మార్గులకు కఠిన శిక్ష వెయ్యాలనీ, కనీసం నలుగురు కలిసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే బాత్రూం కు వెళ్తానని వెళ్ళిన తమ బిడ్డ ఇంటికి తిరిరలేదని చెప్పారు..తమ కూతురు చదువుతున్న కాలేజీలోనే... అతడు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడనీ, కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడనీ చెప్పారు. తమ కూతురికి ఎదో చెప్పి మృగాళ్లు రేప్ చేసీంటారని అని వారు అంటున్నారు..

 

విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువకుడిని పట్టుకోచారు..అయితే అతను చెప్పిన వివరాల ప్రకారం..అర్థరాత్రి ఆ యువకుడే ఆమెను తనతోపాటూ తీసుకెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను రేప్ చేసి చంపేశాడా లేక మాటా మాటా తేడా వచ్చి చంపేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కుర్రాణ్ని కోర్టులో హాజరుపరిచి... కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే తప్ప ఈ కేసు మిస్టరీ వీడేలా లేదు.. చంపింది ఎవరా అని వివరాలు తెలియాల్సి ఉంది..

 

"ఆడ పిల్ల ఆవేదనా".. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్ల తన మానా ప్రాణాలను విడవాల్సి వస్తుందేమో అని.. అమ్మ కు నన్ను ఇప్పుడే చంపెయి అంటూ వేడుకుంటుంది.. అమ్మా నేను ఈ భూమీదకు వచ్చినా కూడా నన్ను నా శరీరాన్ని కామ రాబందులు పొడిచి చంపేస్తాయి.. అందుకే నన్ను ఇప్పుడే చంపేయి అని కళ్ళు తెరవక ముందే కన్నీరు కారుస్తుంది...ఓ ఆడ పిల్ల మేలుకో కామంతో నీ పై చెయ్యి వేసిన మృగాడిని మట్టిలో కలిపేసి అప్పుడే ఆడపిల్లలకు రక్షణ... ఆడ పిల్లను కాపాడండి.. భూమాత నెత్తుటి కన్నీరును ఆపడంది సోదరులారా...

మరింత సమాచారం తెలుసుకోండి: