డబ్బుకు ఈ మధ్య కాలంలో విలువ లేకుండా పోయింది.. వంద రూపాయలు వస్తున్నాయంటే ఎంత కష్టమైన కూడా భరించే మనుషులు తయారవుతున్నారు. అందుకే మహిళలపై గ్యాంగ్ రేపులు కూడా రోజుకొకటి వెలుగు చూస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఓ చేతకాని మృగాడైనా భర్త భార్యను పేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి కి అమ్మేశాడు. నా అనుకున్న వాళ్ళే కష్టాల్లోకి తోసేస్తే ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది.
చట్టాలు ఎన్ని మారిన, శిక్షలు ఎన్ని మారిన కూడా ఆడవాళ్లపై హత్యలు ఆగడాలు ఎక్కడా కూడా మారలేదు. సమాజంలోనే ఇంట్లోనే రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను ఫేస్బుక్ ఫ్రెండ్స్తో సామూహిక అత్యాచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్లో ఈ ఘటన జరగ్గా శనివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ మగాడు కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి ఫేస్బుక్లో ముంబయిలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే అభిషేక్, మంగేష్ అనే స్నేహితులున్నారు. రమేశ్ తరుచూ భార్యతో దిగిన ఫోటోలు ఫేస్బుక్లో పోస్టు చేస్తుండటంతో వారిద్దరూ లైక్ కొట్టి కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే అతడి భార్య ఆ ఇద్దరు కన్నేశారు. ఓ రోజు నీ భార్యతో మా కోరిక తీరిస్తే అడిగినంత డబ్బిస్తామని అతడికి ఆఫరిచ్చారు. డబ్బు ఆశ ఉన్న అతను మృగాడిలా రెచ్చిపోయాడు..
అలా నమ్మించి భార్యను ఓ గదిలో తీసుకెళ్లి వదిలేసాడు. అక్కడకు వచ్చిన ఆ ఇద్దరు కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పడంతో ఆమె భయపడి అలానే ఉండిపోయింది. భర్త మరోసారి అలాంటి వేధింపులకే పాల్పడుతుండటంతో ధైర్యం చేసి పాల్ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కేసును జోగేశ్వరి స్టేషన్కు బదిలీ చేశారు. అలా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని మహిళను కాపాడారు.