వరుసలు గాలికి వదిలేసి.. వావి వరుసలు మర్చిపోయి ఈ జనాలు ప్రవర్తిస్తున్నారు.. అందుకే ఈ సమాజం చాలా దారుణంగా దిగజారింది.. పొద్దున్నే లేచినప్పటి నుండి పడుకొనే వరకు ఎన్నో రకాలా వార్తలను వింటూ ఉంటాము.. అలాంటిది మహిళలని ఎక్కడా ఘోరంగా చూస్తున్నారు...కొంత మంది సొంత వాళ్ళు అయిన వాళ్ళు అని కూడా చూడకుండా నీచానికి ఒడిగట్టి చంపేస్తున్నారు..

 

అయితే ఓ మహిళ వరుస పిన తల్లి అవుతుంది..తన తండ్రికి రెండో భార్య...అయితే ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి.. ఈ క్రమంలో తల్లి భాద చూడలేని యువకుడు సవతి తల్లి నీ చంపేశాడు.. అలా ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు... క్షణికావేశంలో చేసిన ఒక చిన్న తప్ప అతని మెడకు చుట్టుకుంది..అసలెందుకు చంపాడు.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలను చూస్తే..

 

హైదరాబా్లోని మల్కాజ్ గిరి లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది..వివరాలిలా...తల్లి వరసైన ఓ మహిళను యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం  సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన యాదగిరి రెండో భార్య లలితను, ఆయన మొదటి భార్య కుమారుడు కృష్ణ హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

విచారణ చేపట్టిన పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కర్రతో లలిత తలపై విచక్షణారహితంగా బాదడంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: