మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు.  ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోతున్నా.. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా.. వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో ఓ 60 ఏళ్ల కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై   అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

దారుణ ఘటన గంపలగూడెం మండలంలో జరిగింది. పాఠశాలకు వెళ్తున్న బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు.. కోతులు వస్తున్నాయంటూ భయపెట్టాడు. అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో రక్తస్రావం జరుగుతుండడాన్ని గమనించిన తల్లి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప‌రీక్ష‌లు చేయించ‌గా బాలికపై అత్యాచారం జరిగిందని తెలిసింది. దీంతో ఆ త‌ల్లిదండ్రులు ప్రశ్నించడంతో జరిగిన ఘోరాన్ని బాలిక తెలిపింది.

 

ఈ నేప‌థ్యంలోనే బాలిక త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడు బి.నాగులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బాలికను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి త‌రిలించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: