అందమైన భార్య కావాలని పెళ్లి కావాలని పెళ్లికి ముందు చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు..కానీ పెళ్ళైన తర్వాత తన భార్యను ఎవరైనా చూస్తే మాత్రం తట్టుకోలేక పోతారు.. ఇంకా చెప్పాలంటే ఆమె అందం తనకే సొంతం అంటూ చాలా మంది అనుకుంటారు..ఎవరు చూడటానికి వీలు లేదని అంటారు..అందుకోసం ఆమెకు నరకయాతన చూపిస్తారు.. ఇంకా చెప్పాలంటే తన అందాన్ని కూడా చంపెంత క్రూరంగా తయారవుతారు..

 

ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళితే..బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్‌ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణికి రెండు సంవత్సరాల క్రితం హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీ (26)తో వివాహమైంది.అయితే అందంగా ఉన్నా ఈమెను చాలా మంది చూస్తుండటంతో అతను అందరితో రంకూ కట్టి హింసించేవాడు..

 

అందంగా ఉండే జయశ్రీపై సుబ్రమణి తొలి నుంచి అనుమానం పెంచుకున్నాడు. జంటగా ఎక్కడికెళ్లినా అందరూ ఆమెను చూస్తున్నారన్న ఆక్రోశంతో బయటికి తీసుకెళ్లేవాడు. నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవాడు. గుడికి వెళ్లినా ఆమెకు దూరంగానే ఉండేవాడు. అయితే కుటుంబ కట్టుబాట్ల కారణంగా జయశ్రీ ఆ వేధింపులన్నీ భరిస్తూ వచ్చింది. అతడి పైశాచికం మరింత పెరగడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది.

 

రెండ్రోజుల్లో వచ్చి అల్లుడితో మాట్లాడతామని వారు నచ్చజెప్పారు. ఈ పరిణామాల మధ్యే జయశ్రీ ఆదివారం ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. సర్జాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జయశ్రీని ఆమె భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాదు చేయడంతో రంగంలో దిగిన్ పోలీసులకు భర్త చంపేశాడు నిర్దారణకు వచ్చారు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: