ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు మహిళలపై అఘాయిత్యాలు ఆగడాలు , మరి ఘోరంగా రేపులు లైంగిక దాడులు అని వింటుంటాం..అదే ఇప్పుడు కూడా జరిగింది విజయ వాడలో దారుణం చోటచేసుకుంది..నగలు ఇవ్వడానికి మహిళ నిరాకరించడం జరగడంతో అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశారు దుండగులు..అందుకే మహిళలు ఎటు చూసినా కష్టాలు పడుతూనే ఉన్నారు.. 

 

 

వివరాల్లోకి వెళితే..జనసంచారం ఎక్కువగా ఉండే భవానీపురం పాండు హోటల్ సెంటర్‌లోని ఇంట్లో మహిళ హత్య జరగడం నగరంలో కలకలం రేపింది. సాయంత్రి ఆరు గంటల సమయంలో హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలో భవానీపురం ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వేళలో హత్య జరగడంతో ముందుగానే రెక్కీ నిర్వహించి మరీ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది...

 

 

ఇకపోతే నగలను దోచుకున్న వారు ఎటువంటి క్లూస్ దొరకకుండా కారం పొడి చల్లి వెళ్లారని పోలీసులు అంటున్నారు..పద్మావతి భర్త ఇంటికి సమీపంలోనే షాప్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. గొంతుకోసం హత్య చేయడం.. మృతురాలి ఒంటిపై ఆభరణాలు కనిపించకపోవడంతో దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ..

 

బాగా ఉన్నవారు కావడంతో ఆస్తుల విషయంలో ఎటువంటి గొడవలైన ఉనాయేమో అనే కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు..స్పాట్‌లో కారంపొడి చల్లడంతో పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా? లేక సొంతవాళ్లే హత్య చేసి దోపిడీగా చిత్రీకరించే యత్నం చేశారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. హత్య జరిగిన ఇంటికి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.. ఎందుకు అంత కిరాతకంగా చేశారు.. దర్యాప్తులో ఉన్న ఈ కేసు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: