ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది.. కానీ చాలా వాటిలో వెనకుంది.. సైన్స్ పెరిగిన కూడా మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.. హైటెక్ రేంజులో సాంకేతికంగా ఈ ప్రపంచం దూసుకెళ్లిన కూడా మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మడానికి మాత్రం ముందుంటారు..అవి చేస్తే ఇది జరుగుతుంది.. ఇవి చేస్తే అది జరుగుతుంది అంటూ ఏవేవో చేస్తున్నారు.. ..

 

 

ఆ క్రమంలో ఓ మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు..ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల మధ్యే బతుకీడుస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మేవారు... తమకు తెలిసిందే ప్రపంచం అనుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. నరబలి ఇస్తే క్షుద్రశక్తులు వశం అవుతాయని నమ్ముతున్న కొందరు అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో గల నల్లమల్ల అడవుల్లో ఓ మహిళను మంత్రగాళ్ల నరబలి ఇచ్చారు.

 

 

నల్లమల అభయారణంలో ఉన్న అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటకు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతట్టు అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను వివస్త్రను చేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ద్వారా గుర్తించారు. అక్కడ లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శాంతిరవి ముదిలియార్‌గా గుర్తించారు. దీంతో అచ్చంపేట పోలీసులు థానె పోలీసులకు సమాచారం ఇచ్చారు...

 

 

అయితే ఆమె చనిపోయి పదిరోజులు అయి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూలు, కొన్ని బొమ్మలు లభించడంతో క్షుద్రపూజలు చేసే వ్యక్తులు ఆమెను నరబలి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇకపోతే మహారాష్ట్ర నుండి ఆమె వచ్చిందని పోలీసులు వెల్లడిస్తున్నారు.. ఆమెను చంపేసిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: