చేపల వ్యాపారి హత్య కేసు ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తుంది.  చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. రమేశ్‌కు మూడు రోజుల కిందట అరుణ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ కాల్ తో అతను బయటకు వచ్చారని సమాచారం. 

 

అప్పటి నుండి కనిపించకుండా రమేష్ పోయాడు. కిడ్నాప్‌కు గురైన మరుసటి రోజు రమేశ్ మొబైల్ నుంచి దుండగులు అతడి మేనకోడలు ఫోన్‌కు సందేశం పంపించినట్లు రమేశ్ సోదరుడు తెలిపాడు. తక్షణం రూ.కోటి ఇవ్వాలని, లేదంటే రమేశ్‌ను చంపేస్తామని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించినట్లు చెప్పారు. రమేశ్ గురించి గాలిస్తు్న్న కుటుంబసభ్యులు అతడు కిడ్నాప్‌కు గురైనట్లు తెలిసిన వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.

 

 

ఆదివారం మధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఓ మహిళ, పిల్లాడితో అద్దెకు దిగినట్లు చెప్పాడు. ఆ మహిళను తన భార్యగా పరిచయం చేసినట్లు వెల్లడించాడు. రమేశ్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం.. గదికి పిలిపించి హత్య చేసినట్లు గుర్తించారు. 3 రోజుల కిందటే హత్య చేసినా.. మంగళవారం ఉదయం వరకు అతడి ఫోన్ నుంచి మెసేజ్‌లు చేసినట్లు బంధువులు తెలిపారు. రమేశ్‌ను వరంగల్ తీసుకెళ్తున్నామని, కోటి రూపాయలు వెంటనే ఇవ్వాలని..

 

 

ఆ నంబర్ నుండి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. శ్రీనివాస్‌ని ప్రధానంగా అనుమానిస్తున్నారు. అతడి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. సోమవారమే అద్దె చెల్లించి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని తెలిపాడు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.చేపల వ్యాపారంలో బాగా సంపాదించారు. దానితో ఓర్వలేని వారే ఈ పనికి ఒడిగట్టారని సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: