దొంగ బాబాలు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.. నోటి లోంచి శివ లింగాన్ని తీస్తాను అని.. జుట్టులోంచి నీళ్లను రప్పిస్తనని మరికొందరు జనాలను నమ్మించి మోసం చేస్తున్నారు..అయితే ఈసారి ఓ దొంగ బాబా మాత్రం ఆలస్యం చూపిస్తాను అక్కడ స్వామి పవర్ ఫుల్ అంటూ ఓ మహిళను నమ్మించి ఎవరూ లేని సమయాన్నీ చూసి దారుణంగా రేప్ చేసిన ఘటన నాగ కర్నూల్ లో చోటుచేసుకుంది..


వివరాల్లోకి వెళితే.. మహిళను నమ్మించి అత్యాచారం చేసి హత్యచేసిన సాధువు మట్కాస్వామిని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీసులు అరెస్ట్ చేశారు..నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళను ముంబై వాసిగా పోలీసులు అతను ఒక దొంగా స్వామి అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


ఆలయాలను సందర్శన కోసం ఆమె దేశంలోని పలు ప్రాంతాలను తిరిగే అలవాటు ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో తిరుపతికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పి వచ్చింద నీ కుటుంబ సభ్యులు అంటున్నారు..జనవరి మాసంలో ఆమె శ్రీశైలంలో మల్లిఖార్జునస్వామి దర్శనం కోసం వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జనవరి 25న ఇద్దరూ నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆలయానికి వెళ్లే దారిలో మట్కాస్వామి మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది..


మృతదేహాన్ని గుర్తించిన అటవీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు..మృతదేహానికి సమీపంలో ఆమె ఆధార్ కార్డు, ఆమె బస చేసిన గది రశీదులు లభ్యమయ్యాయి.ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరో వైపు మృతురాలు బస చేసిన హోటల్ గదికి సమీపంలో ఉన్న సీ సి టీవీ లో ఉన్న పుటేజ్ కారణంగా తనతో వచ్చిన అతనే హత్య చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: