దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోతున్నా.. మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా పర్యాటక ప్రదేశాలకు నెలవైన బ్రెజిల్‌ అందాలను చూసేందుకు లిథువేనియాకు చెందిన ఓ జంట వచ్చింది. 

 

బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోకి సమీపంలోని బీచ్‌కు దూరంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఓ హౌస్‌లో బస చేసింది. అటవీ ప్రాంతంలో బీచ్ అందాలను చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ జంటకు ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. ఓ ఆగంతకుడు పర్యాటకులు బస చేస్తున్న బీచ్ హౌస్‌లోకి చొరబడ్డాడు. ఈ క్ర‌మంలోనే భర్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేశాడు. అతనిని అత్యంత కిరాతంగా హింసించి దారుణంగా చంపేశాడు. 

 

ఇక‌ భర్తను చంపేయడంతో షాక్‌లో ఉన్న భార్యను ఆ కీచ‌కుడు దారుణంగా రేప్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రియో డి జెనొరోకు సమీపంలోని పరాటీ ప్రాంతంలో నివసించే 37 ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం మృతుడి భార్య నుంచి వివరాలు సేకరించారు. తన భర్తను చంపేసి తనపై దారుణంగా అత్యాచారం చేసినట్లు ఆమె చెప్ప‌డంతో అత‌డిపై కేసు న‌మోదు చేసి జైల్‌కు త‌ర‌లించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: