మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. కాపురాలు జైలుకెళ్లి చస్తున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు, అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. దీంతో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం దంపతులు పెళ్లి చేసుకుంటున్నారు గానీ వారి మధ్య శారీరక సంబంధం ఎప్పుడో కానీ ఉండడం లేదు. ఈ క్రమంలో కూడా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల మోత మోగింది. గురుగ్రామ్ లోని బీజేపీ మహిళా నేత ఇంటిలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
కాల్పులకు పాల్పడింది ఎవరో కాదు.. ఆమె భర్త సునీల్ గోధారా. ఆ తర్వాత సునీల్ గోధారా ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఇక చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి బీజేపీ మహిళా నేత మునేష్ గోధరా విగత జీవిగా రక్తపు మరకల్లో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. మునేశ్, సునీల్కు 2001లో వివాహామైంది. ప్రస్తుతం గురుగ్రామ్లో కంపెనీలో సునీల్ గోధారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. మునేశ్ గోదారా 2013లో బీజేపీ అనుబంధ సంస్థ ‘మహామంత్రి అనే మహిళా విభాగం'లో చేరారు.
క్రమంగా ఎదుగుతూ.. గురుగ్రామ్ బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే తరచూ భార్య ఫోన్లో మాట్లాడుతుండడాన్ని జీర్ణించుకో లేని సునీల్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. గన్ తో ఆమో ఛాతిపై కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఇక ఆమె భర్త మాత్రం అక్కడ నుంచి పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సనీల్ కోసం గాలింపు చర్యలను చేపట్టాయి.