కావాల్సిన ప‌దార్థాలు:
జొన్నపిండి- ఒక‌ కప్పులు
బియ్యప్పిండి- రెండు స్పూన్లు
నీరు - తగినంత

 

ఉప్పు- రుచికి తగినంత
నువ్వులు- అర‌ కప్పు
మైదా పిండి- రెండు స్పూన్లు

 

త‌యారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండి మ‌రియు మైదా పిండి తీసుకుని అందులో ఉప్పు జతచేసి వేడి చేసిన నీటిని కలుపుతూ గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు పిండిని నాలుగు సమభాగాలుగా చేసి అరచేత్తో పూరీసైజుకు ఒత్తి రెండు వైపులా నువ్వుల్లో అద్దాలి. ఇప్పుడు రొట్టెలపీట పైన పొడి జొన్న పిండి చల్లుతూ అరచేత్తో మెల్లగా ఒత్తుతూ గుండ్రంగా విశాలంగా చేయాలి. 

 

దీన్ని పెనంపైన జాగ్రత్తగా విరగకుండా వేసి నీరు తడిపిన గుడ్డతో ఒకసారి రొట్టె పైపైన తుడవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రొట్టెకు అంటిన పొడిపిండి పోతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి అదేమాదిరి తడిగుడ్డతో తుడవాలి. ఇలా అటూ ఇటూ తిప్పుతూ రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి. అంతే నువ్వుల రొట్టె రెడీ. దీన్ని ఏదైన క‌ర్రీతో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: