సమాజంలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా తయారవుతున్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా.. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తెస్తున్నా మృగాళ్లలో మార్పు రావడంలేదు.
అసలు మృగాలు అంటే అడవిలో ఉండేవి.. కాని ఇప్పుడు మనముందు మనుషుల రూపంలో తిరుగుతున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కన్నుమిన్ను కానక కామం ఒక్కటే సంతృప్తిని ఇస్తున్నట్లుగా బ్రతికేస్తున్నారు లోకంలోని మనుషులు. దీంతో సమాజం ఎటు పోతుందో ఆర్థం కానీ పరిస్థితి. ఇక తాజాగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. 8వ తరగతి చవుతున్న బాలికపై... వారితో పాటు... ఆ ప్రాంతాంలోనే నివసిస్తున్న శంకర్ నాయక్ అనే ఓ నీఛుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే రెండు సార్లు సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు. దీంతో ఆ నీచుడి బెదిరింపులకు భయపడిపోయిన ఆ పసిప్రాణం ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయితే ఆ వయస్సులోనే ఆమె గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లదండ్రులు అమ్మాయిని రహస్యంగా తొమ్మిది నెలలు ఉంచి ఆస్పత్రికి తీసుకెళ్లి డెలివరీ చేయించారు. అక్కడ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ కేంద్రంలో వదిలి వెళ్లిపోతుండటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులకు అసలు విషయం తెలుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.