గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే అమ్మాయిలపై వ్యభిచార ముఠాలు కన్నేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమాలో నటించే అవకాశమంటారు.. ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగమంటారు.. బంగారు భవిష్యత్తును చూపిస్తామంటారు.. చివరకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డే అమ్మాయిల గురించి లోతుగా పరిశీలిస్తే వారందరిదీ ఒకటే గాథ.. అదే అందమైన బంగారు జీవితాన్ని చూపించి చివరకు వ్యభిచార రొంపిలోకి దించడం. 

 

ఇక తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్బుల పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న  ముఠా గుట్టురట్టు అయింది. భారత్‌కు చెందిన అనంత్, ప్రియాంక రాజేశ్ దంపతులకు సింగపూర్‌లో రెండు హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్బులు ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన ముగ్గురు డ్యాన్సర్లు పనిచేస్తూ వారితోనే కలిసి నివాసం ఉండేవారు. కనీసం విశ్రాంతి లేకుండా ముగ్గురు మహిళలతో క్లబ్బుల్లో డ్యాన్స్ చేయించేవారు. టార్గెట్లు ఇచ్చి అవి కాకుంటే జీతంలో కోత విధించి వేధింపులకు పాల్పడేవారని తెలుస్తోంది. కొద్దిరోజుల తర్వాత ఓ డ్యాన్సర్‌ని పిలిచిన ప్రియాంక.. కస్టమర్లతో వెళ్లాలని చెప్పడంతో ఆమె దిమ్మ‌తిరిగింద‌ట‌.

 

దీంతో ఆమె నిరాక‌రించి తిరిగి బంగ్లాదేశ్ వెళ్తానని చెప్ప‌డంతో.. ఆగ్రహించిన ప్రియాంక 4 లక్షల బంగ్లా కరెన్సీ చెల్లించాలని డిమాండ్ చేసింది. డ్యాన్సర్ల పాస్‌పోర్టులు, ధ్రువపత్రాలు లాక్కుని అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లకుండా బందించార‌ట‌. అయితే కొన్ని రోజుల‌కు వారి ద‌గ్గ‌ర నుంచి ఆ బంగ్లా డ్యాన్సర్ త‌ప్పించుకుంది. మ‌రియు మిగిలిని ఇద్ద‌రు డ్యాన్స‌ర్లు కూడా ప‌ని చేయ‌డం మానేశార‌ట‌. ఆ త‌ర్వాత ఈ ముగ్గురు డ్యాన్స‌ర్లు క‌లిపి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు అనంత్, ప్రియాంకను అరెస్టు చేశారు. ఇక నేరం రుజువు కావ‌డంతో కోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా వేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: