చక్కని చదువు ఉండాలే కానీ.. మంచి జీతం ఇచ్చేందుకు కార్పొరేట్, మల్టీ నేషనల్ కంపెనీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మరో సంఘటన రుజువు చేసింది. హైదరాబాద్ విద్యార్థినికి ఏకంగా 40 లక్షల వార్షిక వేతనం అందుకోబోతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థిని చక్కటి అవకాశం చేజిక్కించుకుంది.

 

 

హైదరాబాద్ షేక్ పేటలోని జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని రూ.40 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నారు. ఎంఎస్ ఎడోబ్ సంస్థ నిర్వహించిన నియామకాల్లో కళాశాలకు చెందిన బీటెక్ సీఎస్ఈ ఫైనలియర్ చదువుతున్న ఎం. లోహితా రెడ్డి ఈ ఘనత సాధించింది. ఈ మేరకు కళాశాల ప్రతినిధులు ఆమెను అభినందించారు.

 

 

కళాశాలలో పలు సంస్థలు ఇటీవల ప్రాంగణ నియామకాలు నిర్వహించాయి. రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకున్న లోహితా రెడ్డిని కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్ అభినందించారు. ఆరంభంలోనే మంచి వేతనం అందుకబోతోతున్న ఈ యువతి ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: