ఉమెన్స్డే సందర్భంగా సంప్రదాయ ఉత్పత్తులను, సంప్రదాయ కళలను కాపాడటంతోపాటు వాటికి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేవీఆర్ గ్రూపు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే మన సంప్రదాయాలను మగువలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవీఆర్ సంస్త ఆద్వర్యంలో మగువల మనసుకు మెచ్చే డిజైన్లను చేరువ చేసే క్రమంలో స్త్రీ పేరుతో ప్రత్యేక డిజైనర్ స్టోర్ను హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ చీరలతో ప్రదర్శన ఫ్యాషన్ షో నిర్వహించారు.
విస్తృత శ్రేణి వర్గాలు మరియు సేకరణలతో, మహిళల ప్రీమియం కోచర్ బ్రాండ్ అయిన స్త్రీ మహిళల ఫ్యాషన్లోకి కొత్త జీవితాన్ని తీసుకురానుంది. వారు మనసు పడే రీతిలో, వారు కోరుకునే రీతిలో డిజైన్లను తీర్చిదిద్ది అందించే సంస్థగా ఇది ముందుకు రానుంది. అసాధారణమైన నైపుణ్యాలతో ప్రఖ్యాత జాతీయ సంస్థల నుండి పట్టభద్రులైన ప్రొఫెషనల్ డిజైనర్లు స్త్రీకి వెన్నుముకగా నిలుస్తున్నారు. వారి వినూత్న మరియు స్ఫూర్తిదాయక నైపుణ్యాలు మన హృదయాలకు దగ్గరగా చేస్తాయి.
ఇక్కడ స్టోర్లో కాంచీపురం హస్తకళా చీరలు, ప్రీమియం పెళ్లి దుస్తులు, కాశ్మీరీ ఎంబ్రాయిడరీ చీరలు, ఇండో వెస్ట్రన్ లైన్, ప్రింటెడ్, ఫ్యాన్సీ, ఎంబ్రాయిడరీ, వెస్ట్రన్ చీరలు, క్యాజువల్ లైన్, కోచర్ లెహెంగాస్ మరియు సెట్లు, స్టోల్స్ మరియు దుపట్టాలు ఉన్నాయి. మహిళల ఆహార్యానికి, ఆలోచనలకు తగిన విధంగా ఇక్కడ డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ రూ. 7000 /- నుంచి మొదలుకొని రూ. 12 లక్షల ప్రత్యేకమైన ప్రీమియం డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మధ్య తరగతి నుంచి విలాసవంతనమైన వారు ఇష్టపడే అన్ని రకాల డిజైనర్ దుస్తులను వారికి తగిన విధంగా తీర్చి దిద్ది అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి మాధవి లతా, భోంతు శ్రీదేవి మరియు శ్రీజా రెడ్డి పాల్గొన్నారు.