ఇటీవల కాలంలో ఎందరో అమ్మాయిలు వ్యభిచార గృహాంలో మగ్గిపోతున్నారు. కొంత మంది స్త్రీలు పేదరికం మరియు ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బాలికలని నిర్భందించి వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని సగానికి సగంపైగా ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు.. మరియు వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నట్టు కొన్ని నివేధికలు కూడా తేల్చాయి.
ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్రాకెట్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇక విటులు బీహార్కు చెందిన బిద్యపతి సాహా, కటక్కు చెందిన దీన్దయాళ్రావు, పిపిలికి చెందిన అల్లియుద్దీన్ ఖాన్, సునీల్ మొహారానాను అరెస్ట్ చేశారు. ఐదుగురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఒడిశాకు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు కోల్కతాకు చెందినవారుగా సమాచారం.
అంతేకాకుండా.. వ్యభిచారం గృహంలో రెండు కార్లు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఒక్కనెలలోనే భువనేశ్వర్లో వివిధ ప్రాంతాల్లో సెక్స్ రాకెట్స్ చేధించి 16 మంది సెక్స్వర్కర్లకు విముక్తి కల్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లర్ల ముసుగులో అనేకమంది సెక్స్ దందాలకు పాల్పడుతున్నారని తమకు సమాచారమున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.