కావాల్సిన పదార్థాలు:
పచ్చిశెనగపప్పు- ఒక కప్పు
బెల్లం తురుము- ఒక కప్పు
యాలకుల పొడి- చిటికెడు
బియ్యం పిండి- ఒక కప్పు
బెల్లం- అర కప్పు
తయారీ విధానం: ముందుగా పచ్చిశెనగపప్పును ఉడికించి నీటిని వంపేయాలి. ఇప్పుడు బెల్లంను పొడి చేసుకుని.. ఉడికించిన శెనపప్పు, బెల్లం, యాలకుల పొడి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చెయ్యాలి.
దీనిని చిన్న చిన్న లడ్డూలులాగా చేసి ఒక్కోదాన్ని పూరీల్లా వత్తాలి. ఇలా చేసిన పూరిల్లో పూర్ణం లడ్డూని పెట్టి మడత వేసి అంచులను కవర్ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న అన్నింటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఎక్కువ తీపి కావాలంటే, పైన పంచదారను చల్లుకోవచ్చు. అంతే ఉగాది స్పెషల్ పూర్ణం కుడుములు రెడీ. వీటిని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.