వావి వరుసలు మరిచి ప్రేమమైకంలో కళ్లు మూసుకుపోయిన ఓ చెల్లెలు అక్కను ప్రియుడితో కలసి అంతం చేసింది. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోలేదని అక్కను చంపేసింది ఆ చెల్లెలు. ఈ సంఘటన తమిళనాడులోని నామక్కల్లో సమీపంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కను హతమార్చిన చెల్లెలు, ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్ కుమార్తె మోనిషా (18) నామక్కల్లో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. కొంతకాలంగా ఆమె రాహుల్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది.
అయితే వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తితో ప్రేమ ఏంటని విషయం తెలిసి చెల్లెలును అక్క మోనిషా నిలదీసింది. పద్ధతి మార్చుకోకపోవడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నాటి నుంచి అక్కపై పగను పెంచుకున్న చెల్లె ఆమె ప్రియుడు రాహుల్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మోనిషాను ఆమె చెల్లెలు ప్రియుడు రాహుల్ కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మణికట్టుపై ఆమె చేతిలోనే కత్తి ఉంచి కట్ చేశారు. తమకేమీ తెలియదన్నట్లుగా అక్క ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.
దీంతో ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మోనిషా మార్గమధ్యలోనే చనిపోయింది. మోనిషా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయంపై తల్లిదండ్రులను వేధించింది. పోలీసులకు కూడా పలు అనుమానాలు తలెత్తాయి. వారు అనుమానించినట్టుగానే మోనిషాను గొంతు నులిమి చంపినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో మోనిషా చెల్లెలిని పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేపట్టడంతో నేరం అంగీకరించింది. దీంతో సోమవారం ఇద్దరు నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple