ఆడవాళ్లు ఎక్కువ శాతం ఎదుర్కుంటున్న సమస్య మొటిమలు . ముఖం మీద  ఇవి ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. మొటిమలు ఎక్కువ ఉంటే ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది. అందుకే రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు.ఎక్కువ శాతం మంచినీటితోనే కడగాలి. 

నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి.

 

ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి.రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూత్  పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి. మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద పేస్ట్ లా రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

 

ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తాయి. దీని కోసం ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో 10 సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. లేదా.. ఓ ఐస్ క్యూబ్‌ని తీసుకుని మొటిమలపై పెట్టాలి. మరి ఇబ్బందిగా అనిపిస్తే ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: