వేసవి రాగానే చాలామందిని చమటకాయలు వేధిస్తుంటాయి. అందులోను ఆడవాళ్లు మరి ఇబ్బంది పడుతుంటారు చెమటకాయలు వల్ల. వంటగదిలో వంట చేసేటపుడు వేడిని తట్టుకోవాలనుంటే మహా కష్టం.అందుకే వీటి నుంచి బయటపడేందుకు ఏవేవో పౌడర్లు వాడుతుంటారు. వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి. కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి.

 

చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి.అలాగే  చందనాన్ని అరగదీసి చర్మానికి లేపనంగా వేస్తుంటే చమటకాయల బెడదను వదిలించుకోవచ్చు.చందనంలో ఎర్రచందనం, తెల్లచందనం అని రెండు రూపాల్లో ఉంటుంది. ఎర్రచందనం అనే దానిని పరికరాలు, బొమ్మల తయారీకి వాడుతుంటారు. దీని నుంచి నూనెను సేకరిస్తారు. 

 


తెల్లచందనంతో సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారికీ సెంట్ల తయారీకీ, సబ్బుల తయారీకీ వాడుతుంటారు. ఎర్రచందనం నూనెను చందనాన్ని ఔషధాల తయారీకి వాడుతుంటారు. ఆయుర్వేద మందుల్లోనూ ఇస్తుంటారు. మనం వాడే విధానాన్ని బట్టి తైలాలు పనిచేస్తుంటాయి. దీనిని శ్రీగంధం అని కూడా అంటారు.

 

గంధాన్ని నలుగులా చేసి రుద్దుకుంటే చర్మం మృదువుగా దుర్గంధ రహితంగా ఉంటుంది. గంధం నుంచి తీసిన నూనెను, నీళ్లలో 5-6 చుక్కలు వేసి స్నానం చేస్తే శరీర బడలిక తగ్గుతుంది. ఈ తైలాన్ని నూనెలో కలిపి వత్తిగా చేసి దీపం పెట్టినా, దీనితో చేసిన అగరు వత్తి వెలిగించినా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గంధం అరగదీసి అర చెంచాడు పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, శరీరంలో ఆవిర్లు, మంటలు, పిత్త వికారాలు తగ్గుతాయి. గంధపు నూనెను ఇతర తైలాలతో కలిపి వాడుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: