ఆడవాళ్ళ సౌభాగ్యానికి, ఆరోగ్యానికి సంకేతాలు పసుపు, కుంకుమలు. హిందూ సంస్కృతిలో పసుపు కుంకుమలకు విశిష్టమైన స్థానం ఉంది. ఆడవాళ్ళ అయిదవతనానికి, ముత్తైదువుల మాంగల్యానికి రక్ష పసుపు కుంకుమలు.అయితే  పసుపు అనేక రకములైన వ్యాధులను నయం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనీ ఇటీవల పరిశోధనలో వెల్లడయ్యింది. పసుపు వల్ల ఆరోగ్యమే కాకుండా ఆడవాళ్లకు  అందం కూడా సొంతం అవుతుంది.పసుపు కూరలలో మాత్రమే కాదు.ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపు ఈ విధంగా ఆడవాళ్లకు ఉపయోగపడుతుందో చూద్దామా.. !! 

 

 

ఆడవాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య   రక్తహినత. అందుకే  ప్రతిరోజు పసుపు, త్రిఫలా చూర్ణం, నెయ్యి, తేనె  టీ స్పూను మోతాదులో తీసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు సేవించడం వల్ల రక్త హీనత సమస్య నుండి బయటపడవచ్చు.గర్భధారణ సమయంలో రక్తస్రావం కనిపిస్తుంటే మరిగే నీళ్లకు రెండు చెంచాలు పసుపుని చేర్చి కొంచెం చల్లారాక ప్రతి రోజూ, రక్తస్రావం ఆగిపోయేంత వరకు సేవించాలి.పసుపుని అడ్డ సరం ఆకుల రసంతో కలిపి మెత్తగా మీగడతో కలిపి నూరి ఒక టీ స్పూను మోతాదులో తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది.పసుపు సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది...!!ఒక్కసాఒక్కసారి పసుపుతో ఇలా ట్రై చేసి చుడండి. 

 

 

 శరీరంపై ఏర్పడిన గాయాలకు, పుండ్లుకు పసుపు పూస్తే సూక్ష్మ క్రిములు ఆశించవు. సెప్టిక్ అవదు. త్వరగా మానుపడతాయి.అలాగే  నారింజ తొక్కల పొడిలో పసుపు కలిపి రాసుకుంటే ఆడవాళ్ళ  ముఖం కాంతివంతంగా ఉంటుంది. మంచిగంధం, పసుపు సమానంగా తీసుకుని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు.వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం మృదువుగా, అందంగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసంలో పసుపు కలిపి రాసుకుంటే చర్మంపై ఏర్పడే అన్ని రకాల మచ్చలు మాయమవుతాయి.పెసరపిండిలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: