వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని కావాలిసిన పధార్థాలు : యాలకుల పొడి : 1 టీ స్పూన్  కొత్తిమీర : 1 కట్ట పసుపు: ½ టీ స్పూన్ పాలు : ¼ కప్ నెయ్యి : 2 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ : తగినంత ఉప్పు : రుచికి సరిపడా కారం : 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ : 1 టీ స్పూన్ పెరుగు : 1 కప్ పుదీనా : ½ కప్ వెజిటబుల్ ముక్కలు : 4 కప్స్ మసాలా దినుసులు : 10 గ్రాములు బాస్మతి రైస్ : అర కిజీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లు  ఉల్లిపాయాలు : 1 కప్


 తయారీచేయువిధానం : ముందుగా స్టౌ మీద పాన్ పెట్టే అందులో నూనె పోసి మరిగాక మసాలా దినుసులను వేసి వేయించాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, యాలక్కాయల పొడి, కారం, ఉప్పు, బీన్స్, క్యారెట్ టమోటో,, ఉల్లిపాయల ముక్కలు, పెరుగులను ఒక దాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.


తర్వాత ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి అందులో పాలు కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి, సగం ఉడికాక గంజి వార్చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్ కొద్దిగా వేసి, పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ కొద్దిగా అన్నం ఇలా 4 వరుసలుగా పేర్చుకోవాలి. తర్వాత మూతపెట్టి 10ని ఉడికించాలి. మూత తీసి సరిపడా నెయ్యేసి, అన్నాన్ని దించేయాలి. అంతే వెజిటేబుల్ మసాలా స్టఫ్ బిర్యానీ రెడీ...

మరింత సమాచారం తెలుసుకోండి: