కావలసినవి: ఎసరు నీరు-లీటరు, చిక్కటి పాలు-లీటరు (కాచినవి) బెల్లం తురుము-కిలో, ఛాయపెసరపప్పు-పావ్ఞకిలో నెయ్యి-పావ్ఞ కిలో, జీడిపప్పు-100గ్రా ఎండుద్రాక్ష-50గ్రా, యాలకులు-5గ్రా, పచ్చకర్పూరం-చిటికెడు తయారుచేసే విధానం బియ్యం కడిగి ఉంచాలి. బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి పాకం రానిచ్చి కర్పూరం, దంచిన యాలకులు వేసి కలపాలి.


మందపాటి గిన్నెలో పాలు, నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టాలి. అందులో బియ్యం, పెసరపప్పు వేయాలి. బియ్యం సగం ఉడికిన తరువాత బెల్లం పాకం పోయాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష నేతిలో వేయించి పొంగలిలో కలపాలి.


పొంగలి ఉడికి చిక్కపడుతుండగా సెగ తగ్గించి నెయ్యి పోసి మూతపెట్టి ఉంచాలి. పది నిమిషాల తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పొంగలిని కలియబెట్టి మళ్లీ గట్టిగా మూతపెట్టాలి. నెయ్యి, పచ్చకర్పూరం, బెల్లం సువాసనలతో కమ్మని చక్రపొంగలి రెడీ!


మరింత సమాచారం తెలుసుకోండి: