పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో జరుగుతోన్న విధ్వంసక చర్యలను ఖండించారు. మమతా బెనర్జీ ఎవరు విధ్వంసాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. శాంతి, ప్రజాస్వామ్యయుతంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన వ్యక్తం చేయాలని మమతా బెనర్జీ చెప్పారు.