గురువారం రాత్రి 10.30 గంటల తర్వాత జగన్ తనను కలవచ్చని అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్యాహ్నం చెప్పటంతోనే జగన్ హడావుడిగా విజయవాడ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లుగా అమిత్ కార్యాలయం నుండి పిలుపు రాలేదు. ఎంపిలు, సిఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఎంత ప్రయత్నించినా షాను కలవటం సాధ్యం కాలేదు.