పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి... కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన క్రీములు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి. పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి. కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. నాకు తెలిసిన, మన పూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.


ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం ఈ చిట్కాలో..  కావలసిన పదార్ధాలు... జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా. జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి. తరువాత స్టౌవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి. ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.


ఇలా ఒక 10నిమిషాలు ఉంచి, తీసి ఈ పొడిలో పసుపు కలిపి, గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి. దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: