గడిచిన మూడు వారాల్లో బంగారం ధర ఎన్నడూ లేనంతగా పెరిగిపోతోంది. వ్యాపార వర్గాల్లో దీనికి సంబంధించి ఫుల్ ఖుషీ గా ఉన్నారు. డిమాండ్ పెరుగుతూ ఉండడం తో బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి అని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. తాజాగా ఈరోజు పది గ్రాముల బంగారం 155 రూపాయలు పెరిగి 29,880 రూపాయలకు చేరుకుంది.ఇక వెండి ధర కూడా పెరుగుతోంది. కేజీ వెండి 400 రూపాయలు పెరిగి 43,450 రూపాయలకు చేరుకుంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిందని బులియన్ మార్కెట్ చెబుతోంది. దీంతో, ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములు 29,950 కాగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాముల ధర 29,800 రూపాయలని బులియన్ మార్కెట్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: