భారత దేశంలో విమానరంగంలో ప్రయివేట్ సంస్థలు విపరీతమైన ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా 'సూపర్ సేల్' పేరిట ప్రత్యేక స్కీమును ప్రారంభించింది.  లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థలతో మరింతగా పోటీ పడుతూ ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా తీసుకు వచ్చిన సూపర్ సేల్ స్కీమ్ అందరినీ బాగా ఆకర్షిస్తుంది. నేటి నుంచి మే 25 మద్య బుక్ చేసుకునే ప్రయాణికులకు జూలై నుంచి సెప్టెంబర్ 30 మధ్య నిర్ణయించుకునే వారికి రూ. 1,499 ప్రారంభ ధరలో (అన్ని పన్నులూ కలుపుకుని) టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది.

అయితే ఈ ఆఫర్లు దేశవాళీ రూట్లో మాత్రమే లభిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే గత వారం స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఆసియా లాంటి సంస్థలు ఇతే స్కీమ్ పద్దతులు అమలు పరిచింది..దీంతో ప్రయాణీకుల వారి సౌలభ్యం కోసం ఆయా సంస్థల వెంట పరుగులు పెడుతున్నారు.

ఈ తరుణంలో ఎయిర్ ఇండియా 'సూపర్ సేల్' పేరిట ప్రత్యేక స్కీము రావడం చాలా సంతోషంగా ఉందని ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో స్పైస్ జెట్ రూ. 511 (పన్నులు అదనం), ఇండిగో రూ. 800 (పన్నులు అదనం)కు టికెట్లను విక్రయించాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: