దాదాపు 1500 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా చేసుకుని ఐఒపే తో బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ జనవరి 23 న మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ఆసియా లోనే అత్యంత పురాతన స్టాక్ మార్కెట్ గా చరిత్ర ఉన్న బీఎస్ఈ వాటాల విక్రయం కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూస్తోంది. ఐపీఓలో భాగంగా 1.54 కోట్ల వాటాలను సంస్థ విక్రయించనుంది. పూర్తి వాటాలో ఇది 30 శాతానికి సమానం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బీఎస్ఈ అందించిన ఆర్హెచ్పీ (రెడ్ హెర్రింగ్ ప్రాస్టెక్టస్) ప్రకారం, ఐపీఓ ఈ నెల 23 నుంచి 25 వరకూ కొనసాగనుంది. ఒక్కో వాటాను గరిష్ఠంగా రూ. 500కు విక్రయించాలన్నది బీఎస్ఈ అభిమతం కాగా, లోవర్ ఎండ్ బ్యాండ్ పై వాటాలు విక్రయించినా రూ. 1300 కోట్ల వరకూ నిధులు సంస్థకు అందుతాయి. గత సంవత్సరమే బీఎస్ఈ ఐపీఓకు సెబీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వాటాల విక్రయం తరువాత ఎన్ఎస్ఈలో సైతం సంస్థ లిస్టింగ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: