దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా ఊపు అందుకోవడం తో నిఫ్టీ రికార్డు కొత్తది నమోదు అయ్యింది. మంగళవారం రికార్డు మార్కు ని తాకిన నిఫ్టీ ఆ రికార్డు ని ఇవాళ తిరగరాసింది. ఈ రోజు మార్కెట్ ముగిసే టైం కి సెన్సెక్స్ 188 పాయింట్ లు లాభపడి 29585 పాయింట్ ల దగ్గర , నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 9,153 పాయింట్ల వద్ద ముగిశాయి.


ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఎయిర్ టెల్, రిలయన్స్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

 



మరింత సమాచారం తెలుసుకోండి: