భారత దేశంలో టెలీకాం రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు తీసుకు వచ్చి ఇతర నెట్ వర్క్ సంస్థలకు కునుకు లేకుండా చేస్తున్న రిల‌య‌న్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త అందిస్తుంది.  మలి విడ‌త‌తో ఆపేసిన జియో ఫోన్ బుకింగ్స్‌ను మ‌ళ్లీ ప్రారంభించింది. గ‌తంలో ఈ ఫోన్ కొనేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచిన వారికి సోమ‌వారం నుంచి మెసేజ్‌లు పంపిస్తోంది.

జియో పంపించిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా జియో ఫోన్ బుక్ చేసుకోవచ్చు.గ‌తంలో ఆస‌క్తి క‌న‌బ‌రిచిన మొత్తం 10 ల‌క్ష‌ల మందికి ఇప్పుడు మెసేజ్‌లు పంపిస్తోంది. రూ.500 చెల్లించి బుక్ చేసుకున్న అనంత‌రం ఫోన్ ఎప్పుడు అందించేది చెబుతారు. కాగా, జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ కోసం చెల్లించే రూ.1500ను మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లించ‌నున్న‌ట్టు జియో ఇది వ‌ర‌కే పేర్కొంది. 

ఆగ‌స్టు 24న ముంద‌స్తు బుకింగ్ ప్రారంభం కాగా 60 ల‌క్ష‌ల మంది బుక్ చేసుకున్నారు. ఇటీవ‌ల ఫోన్ డెలివ‌రీలు ప్రారంభించిన జియో పంపిణీ పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు రెండో విడ‌త‌కు సిద్ధ‌మైంది.జియో 4జీ ఫీచర్ ఫోన్ ప్రారంభానికి ముందే టెలికం రంగంలో సంచ‌ల‌నం సృష్టించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: