'ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. కనీస సౌకర్యాల కల్పన వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తవుతుంది. అప్పుడు బడులకు ర్యాంకులు, గ్రేడ్లు ఇస్తాం'' అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఆదర్శ, గురుకులాల ప్రిన్సిపాళ్ల సమావేశం శుక్రవారం( డిసెంబరు 2) జరిగింది. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ర్యాంకులు, గ్రేడ్లు ఇవ్వడంతో బడుల మధ్య పోటీ పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక సాయంతో విద్యా బోధన చేసేందుకు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(టీటీసీ) ఏర్పాటు చేస్తామని ప్రకట