ఆంధ్రప్రదేశ్లోని 986 ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటి భర్తీ ప్రక్రియ గతంలో మాదిరి చేపట్టాలా లేక డీఎస్సీ తరహాలో నిర్వహించాలా అనేది నిర్ణయిస్తామన్నారు. గురువారం (డిసెంబరు 8) వెలగపూడిలో సచివాయలంలోని తన కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్తో పాటు పలు అంశాలు ప్రస్తావించారు.