ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న ఎస్సై తుది రాత పరీక్షలు ఆదివారం(ఫిబ్రవరి 19) ప్రశాంతంగా ముగిశాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 96 శాతం మంది హాజరైనట్లు ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో మొత్తం నాలుగు పేపర్లకు పరీక్ష జరిగింది. వీటికి సంబంధించిన సమాధానాల 'కీ' సోమవారం(ఫిబ్రవరి 20) నుంచి పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: