జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్, ప్రముఖ టుబాకో కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేయుటకు ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఏ, వెలుగు ఏపీఎం పి.ఎస్.రమేష్ మంగళవారం తెలిపారు. రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు, వినుకొండ ప్రాంతాల్లో పనిచేయుటకు డిప్లమో (అగ్రికల్చర్) చదివి 19 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత గల అభ్యర్థులు సంబందిత సర్టిఫికెట్లు, రేషన్, ఆధార్కార్డుల జిరాక్స్, పాస్పోర్టు సైజు ఫోటోలతో ఈ నెల 22న ఉదయం 10గంటలకు గుంటూరులోని నగరంపాలెంలోని చేతన భవన్లో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9966874058ను సంప్రదించాలన్నారు.