గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ సంయుక్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎం జీ.వాసుబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సేల్స్‌ టీమ్‌లో పని చేయడానికి 2017లో ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలని, 18 ఏళ్ల వయసు నిండి ఉండాలని, ఇంటర్‌ ఇంగ్లీష్‌ మీడియంలో ఎంపీసీగానీ, బైపీసీ గానీ 60 శాతం మార్కులు ఉండాలని,ప్రస్తుతం బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈనెల 6న నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. 0863-2210757, 99493-26722, 99084-82907 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: