రెండువేల ఏళ్లనాటి భారతీయ సమాజాన్ని చూడాలంటే, వాత్సాయనుడి కామసూత్రం చదవాలి.ఆ జీవితం నిత్య వసంతం. ముక్కారు పంటలు పండేవి. సిరిసంపదలకు కొదువ లేదు. రేపెలా గడు స్తుందన్న భయం లేదు. శత్రు భీతి లేదు. రోగాల బాధ లేదు. ఎవరికి వారు రసాగ్రేసులు. పడకటిళ్ళు ప్రణయ సామ్రాజ్యాలు. ప్రాచీన భారతీయులు శయనమందిరానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చే వారు. ఏకాంతానికి ఆటంకం లేకుండా నిర్మించుకునేవారు.