నిన్న మొన్నటి వరకు మన పెద్దలు, వైద్యులు చెప్పిన ఉపవాసం గురించి లంఖణం గురించి...నేటి వైద్య విధానం అనుస రించిన...ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసేవారు. పూర్వం మనకు జ్వరాలు కానీ...పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు...
లంఖణాలు చేయించే వారు...దానివల్ల ఎలాగూ నీరస పడేవారు. 


అసలది అవసరం లేదని కేవలం ఆంటి బయోటిక్స్ మాత్రమే  మందులని మన కు బాగా తల కెక్కించారు. ఈ మధ్య వైద్యం లో ప్రకటించిన నోబెల్ బహుమతి గురించి తెలుసు కుంటే ఒకసారి మనం ఆశ్చర్య పోతాము. జపాన్ సైంటిస్ట్ యోశినోరి ఒహ్సుమి కి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఆటోఫాగి (AUTOPHAGY) మీద ఆయన చేసిన పరిశోధనకు గాను ఇచ్చారు. 


ఆటోఫాగి అంటే కణాల రీసైక్లింగ్ పద్ధతి అంటే...“స్వయం భక్షం” ఒక శరీరం ఆహారం తీసు కోకుండా వది లేసి నప్పుడు ఆ శరీరం తన లోపలి కణాలు, ఉపయోగించని ప్రోటీన్లను తిని తన అస్తిత్వం నిలుపు కుంటుంది. ఈ ఆటోఫాగి పద్ధతిని శరీరం కోల్పోతే శరీరం రోగ గ్రస్తం అవుతుంది. 
మనకు ఏకాదశి, కార్తీక సోమవారం లాంటి ఎన్నో పద్ధతుల ద్వారా శరీరానికి ఉపవాసం చేయించే పద్ధతి ఉంది... ప్రతీ 15 రోజులకు వచ్చే ఏకాదశి నాడు. పూర్తిగా నిరాహారంగా వుండడం అనేది. మనవారు ఎప్పటి నుండో అనుసరిస్తూ... వస్తున్న పద్ధతి. 


దైవ చింతన తో... ఉపవాసాలతో...ఆ రోజును చెయ్యడం మన ఆధ్యాత్మిక పురోగతికి చెప్పిన ఒక పద్ధతి... ఈ పద్ధతి ద్వారా ఆటోఫాగి అన్న ప్రక్రియను మనం ఉపయోగించు కుని తద్వారా శారీరక సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు. మన పూర్వీకులు. దీని ద్వారా హానికర కణాలను ప్రక్షాళన చేసుకుని, 
శారీరక సౌఖ్యాన్ని పెంచి, ఉపయో గించని ప్రోటీన్స్ ను కొవ్వును కరిగించు కుని శరీరాన్ని వ్యాధులకు దూ రంగా ఉంచు కునేవారు. 
ఎప్పు,డెప్పుడూ...నేటి సైన్సు కొత్త విషయం కను క్కుంటూ ఉంటే దాని కి మన పూర్వపు పద్ధతులకు ఒక లంకె కన బడుతుంది. 


పక్షం లో ఒక్క రోజు దేవుని స్మరిస్తూ... ఆయన గురించి చింతిస్తూ...ఉపవాసం చేస్తూ... ఆధ్యాత్మిక, శారీరక ఉన్నతిని పొందేవారు.     👇👇👇👇👇👇
నోబెల్ లింక్:- https://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/2016/press.html ఇంతే కాదు వరుసగా...
మూడు రోజులు... నిరా హారంగా ఉండడం వలన...శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేసి...తద్వారా...తెల్ల కణాలను సృష్టించి...రోగ నిరోధక శక్తిని అమితంగా పెంచు తుంది అని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 


మనకు పూర్వం మూడు రోజుల లంఖణాలు చే యించే వారు. ఎంత మంది కి గుర్తుందో లేదో కానీ చేసిన నాకు అను భవం ఇది. శరీరం నీరస బడ్డా రోగం,
రోగానికి కారణం అయిన... ఆ రోగ సెల్స్ సగమై, తెల్ల కణాలు ఇతోధికంగా పెరగడం వలను ఆ రోగం నయం అవుతుంది.
 
దాని లింక్:- 
http://www.telegraph.co.uk/science/2016/03/12/fasting-for-three-days-can-regenerate-entire-immune-system-study/  కేవలం ఉపవాసం చేస్తే ఎప్పుడూ ఆహారం మీద దృష్టి ఉంటుంది. కాబట్టి మనస్సుకు ఆలంబనగా భక్తి అనే పరమ ఔషధాన్ని జత చేసి మనస్సు దేవుని మీద లగ్నం చేయించి మానసిక, 
శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించారు. నిస్సం దేహంగా మన పూర్వీకులు, ఋషులు మానసిక, ఆధ్యాత్మిక, శారీరక సంపూర్ణ వైద్యాన్ని నిర్దేశించడానికి ఇటువంటి పద్ధతులను అను సరించేవారు. 


మనకు పూర్తి అవగాహన లేక చాలా వాటిని కోల్పోయాము. వారికి త్రికరణ శుద్ధి గా తల వంచి... పాదాభివందనం చేసి...వారు చూపిన బాటలో పయ నించడం మన తక్షణ కర్తవ్యం గా భావిస్తూ...

సర్వే జనాస్సుఖినో భవంతు లోకా స్సమస్తాస్సుఖినో భవంతు.


మరింత సమాచారం తెలుసుకోండి: