గతంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న హీరో, హీరోయిన్స్ ఇప్పుడు దోస్త్ లుగా మారారు. దీంతో వీరిద్దరి కలయిన ఇప్పడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియన్ 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ వచ్చారు. ఇందులో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు కూడ జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్ లో సమంత, మహేష్ బాబు పిచ్చాపాటి మాటలు మాట్లాడటం, ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండటం కెమారాలని ఎట్రాక్ట్ చేసింది. ఒకప్పుడు మహేష్ పై డైరెక్ట్ గానే సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో దాడి చేసిన సమంత, ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ఎదురుపడగానే వల్లమాలిన ప్రేమని వలకబోసింది. అలాగే మహేష్ బాబు సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఒకే చోట కలిసి కాసేపు సందడి చేసారు. ఈ విషయాన్నీ సమంత తన ట్విట్టర్ లో సమంత పోస్ట్ చేసింది. ‘సూపర్బ్ నైట్. త్రివిక్రమ్ సార్ మరియు మహేష్ బాబు లతో అదిరిపోయే చాట్. బాగా నవ్వుకున్నాం’ అంటూ సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్ చూసి ఆశ్యర్యపోయారు. ఎందుకంటే మహేష్ బాబు, సమంత ల మధ్య మంచి రిలేషన్ లేదని గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. కానీ ఫంక్షన్ లో జరిగిన తీరు చూస్తుంటే సమంత, మహేష్ ల మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉందనే విధంగా ఉంది. మొత్తానికి సమంత, మహేష్ ని మాటల్లో పెట్టి ప్రిన్స్ ఫ్యాన్స్ కి షాకింగ్ ఇచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: